వాహనదారులకు అలర్ట్‌.. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ కార్ల ధరల పెంపు

30 December 2023

TV9 Telugu

ఆడి – లగ్జరీ కార్ కంపెనీ అయిన ఆడి తన వాహనాల ధరలను కూడా పెంచబోతోంది. ఆడి 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

అడి కారు

హోండా  మైక్రో SUV ఎలివేట్‌తో దేశీయ మార్కెట్లో అత్యంత పోటీతత్వ విభాగంలోకి ప్రవేశించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

హోండా

మహీంద్రా  తన వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించింది. మహీంద్రా స్కార్పియోపై ధరలు పెంచనున్నట్లు తెలిపింది.

మహీంద్రా

మారుతీ – పెరుగుతున్న వాహనాల ధరల కారణంగా మారుతీ కూడా కొత్త సంవత్సరం నుండి ధరలను పెంచాలని నిర్ణయించింది. సాధారణ వాహనాల ధరలు 2-3 శాతం పెరగనున్నాయి. 

మారుతి

మెర్సిడెస్ – ఆడితో పాటు, మెర్సిడెస్ కూడా కొత్త సంవత్సరం నుండి వాహనాల ధరలను 2 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ ధరలు జనవరి 1 నుంచి అమలు కానున్నట్లు తెలుస్తోంది.

మెర్సిడెస్‌

MG మోటార్స్ వాహనాలు వచ్చే ఏడాది నుండి దేశవ్యాప్తంగా ఖరీదైనవిగా మారతాయి. తయారీ ఖర్చులు పెరగడం కారణంగా ధరలను పెంచనుంది.

ఎంజీ మోటార్స్‌

టాటా – దేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ టాటా మోటార్స్ కూడా తన వాణిజ్య వాహనాల ధరలను 3 శాతం పెంచాలని నిర్ణయించింది.

టాటా

టయోటా – టయోటా జనవరి 1 నుండి భారత్‌లో తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంత పెంచుతారనేది స్పష్టత ఇవ్వలేదు.

టాయోటా