సామాన్యులకు షాక్.. ఫిబ్రవరి1 నుంచి కేబుల్ ఛార్జీల పెంపు.. ఎంతంటే..

07 January 2024

TV9 Telugu

ఇంట్లో ఉన్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం.. రోజువారీ వార్తలు, ఇతర సమాచారం కోసం టీవీ చానెళ్లు వీక్షిస్తుంటాం.. కరోనా మహమ్మారితో సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌ల కాలం వచ్చేసింది

ఎంటర్‌టైన్‌మెంట్‌

కరోనా వేళ అందరూ వర్క్ ఫ్రం హోం కింద పని చేయడం, లెర్నింగ్ ఫ్రం హోం ద్వారా పాఠాల బోధన అంతా ఆన్ లైన్ లోనే సాగింది.

కరోనా  సమయంలో

వర్క్ ఫ్రం హోం టైంలోనే అన్ని టీవీ చానెళ్లు మొబైల్ ఫోన్లలో కొన్ని కార్యక్రమాలు ఫ్రీగా అందుబాటులోకి తెచ్చాయి. తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి

మొబైల్‌ ఫోన్‌లలో

ధరలతోపాటు కంటెంట్ ఖర్చులు పెరిగి పోవడంతో ఆయా టీవీ చానెళ్ల సంస్థలకు ఖర్చులు ఎక్కువయ్యాయి. వాటిని వినియోగదారులపై మోపేందుకు బ్రాడ్ కాస్టర్లు సిద్ధం అయ్యాయి

 ధరలు

దేశంలోని బ్రాడ్ కాస్టింగ్ సంస్థల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా, వయాకాం 18 సంస్థలు టీవీ బిల్లులు పెంచబోతున్నాయి

బ్రాడ్‌ కాస్టింగ్‌ సంస్థలు

భారీగా స్పోర్ట్స్ ఈవెంట్లు ప్రసారం చేసే నెట్ వర్క్ 18, వయాకాం18 డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇండియా కాస్ట్.. తమ కస్టమర్లపై చానెళ్ల సబ్ స్క్రిప్షన్ చార్జీ 20-25 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించాయి

ధరలు పెంపు

జీ ఎంటర్‌టైన్‌మెంట్ 9-10 శాతం, సోనీ 10-11 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. డిస్నీ స్టార్ ఎంత చార్జీ పెంచుతున్నట్లు వెల్లడించలేదు

ఎంత మేర పెంపు

 ప్రతిపాదిత చార్జీల పెంపుపై ఆర్ఐఓలో ప్రచురించిన 30 రోజుల తర్వాత పెంచిన సబ్‌స్క్రిప్షన్ చార్జీలు అమల్లోకి వస్తాయి. అంటే ఫిబ్రవరి 1 నుంచి ఛార్జీలు పెరగనున్నాయి

ఫిబ్రవరి 1 నుంచి