ఆ 185 మంది దగ్గరే రూ. 100 లక్షల కోట్లు..!

04 September 2024

Battula Prudvi 

ప్రపంచ దేశాల్లో.. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారతీయ వృద్ధి రేటు ఇతర దేశాలతో పోలిస్తే ఘనంగా వృద్ధిలో ఉంది.

భారత్‌లో సంపన్నుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. భారత్‌లో నికర సంపద ఒక బిలియన్ డాలర్లకు (రూ. 8400 కోట్లు) పైగా ఉన్న వారి సంఖ్య 185.

మొత్తం 185 మంది నికర సంపద ఒక ట్రిలియన్ డాలర్ కంటే చాలా ఎక్కువట. ఇది దాదాపు రూ. 100 లక్షల కోట్లకు సమానమని తెలిపింది ఫార్చ్యూన్ ఇండియా నివేదిక.

185 మంది బిలియనీర్లందరి నికర సంపద 1.19 ట్రిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 99.96 లక్షల కోట్లుగా ఉంది.

మొత్తం 185 మంది సంపద భారతదేశ జీడీపీలో దాదాపు 33.81 శాతానికి సమానం. ఈ ఏడాది కొత్తగా ఈ లిస్టులో 29 మందికి స్థానం.

ఫార్చ్యూన్ అత్యంత సంపన్న భారతీయుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ టాప్‌. ఈయన నికర సంపద 125.15 బిలియన్ డాలర్లు.

గౌతమ్ అదానీ 123.9 బిలియన్ డాలర్లతో రెండో స్థానం. తర్వాత షాపూర్‌జీ మిస్త్రీ (43.47 బిలియన్ డాలర్లు), సావిత్రి జిందాల్ (33.06 బి.డాలర్లు)తో ఉన్నారు.

శివ్ నాడార్ (32.85 బి.డాలర్లు), రాధాకిషన్ దమానీ (30.31 బి.డాలర్లు), దిలీప్ సంఘ్వీ, సునీల్ మిట్టల్, అజీమ్ ప్రేమ్‌జీ, ఆది గోద్రేజ వరుసగా ఉన్నారు.