భారత మార్కెట్లోకి స్కోడా నుంచి ఎలక్ట్రిక్‌ కారు.. ఎప్పుడు అంటే..

01 March 2024

TV9 Telugu

దేశీయ మార్కెట్లో రకరకాల ఎలక్ట్రిక్‌ కార్లు విడుదలవుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్ ధరల నేపథ్యంలో అందరికి దృష్టి ఈవీపైనే ఉంది.

ఈవీ కార్లు

అత్యాధునిక ఫీచర్స్‌తో భారత మార్కెట్లో రకరకాల ఎలక్ట్రిక్‌ వాహనాలు విడుదల అవుతున్నాయి.

అత్యాధునిక ఫీచర్స్‌తో..

ఫ్రెంచ్‌నకు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం స్కోడా.. దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేయడానికి సిద్ధమైంది. 

ఆటో మొబైల్‌ దిగ్గజం

2027లో భారత మార్కెట్లోకి ఈవీని విడుదల చేయాలని అనుకుంటున్నట్లు మంగళవారం సదరు కంపెనీ ప్రకటించింది. 

భారత మార్కెట్లో..

తన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఎన్యాక్‌ను ఈ ఏడాది భారత్‌లో పరిశీలించనుంది. ఈ-మొబిలిటీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఈ-మొబిలిటీ

వచ్చే మూడేండ్లకాలంలో ఆరు మాడళ్లను మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నట్లు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ పెట్రా జనెబా తెలిపారు.

వచ్చే మూడేళ్లలో

ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలను భారతదేశంలోని ఉన్న ప్లాంట్‌లో  అసెంబ్లింగ్‌ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 

భారత్‌లోనే అసెంబ్లింగ్‌

స్కోడా ఎలక్ట్రిక్‌ వాహనాలను 2027 సంవత్సరం నాటికి ఈ మాడల్‌ను తీర్చిదిద్ది విడుదల చేయాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు.

2027 సంవత్సరం నాటికి