మారుతి సుజుకీ గుడ్‌న్యూస్‌.. తగ్గిన కార్ల ధరలు.. ఎంతో తెలుసా?

03 September

Subhash

ఈ మధ్యకాలంలో కార్లు ట్రెండ్‌ పెరిగింది. ఒకప్పుడు డబ్బున్నవాళ్లే కొనేవారు కానీ ఇప్పుడు సామాన్యులు సైతం కారును కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

కార్లు ట్రెండ్‌

వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు మారుతి సుజుకీ ఇప్పుడప్పుడు కార్లపై భారీ ఆఫర్లను ప్రకటిస్తుంటుంది.

మారుతి సుజుకీ 

కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. ఎంట్రీ లెవల్‌ కార్ల ధరలను తగ్గించింది. 

ఎంట్రీ లెవల్‌ కార్లు

ఆల్టో కే 10, ఎస్‌-ప్రెస్సో మాడళ్ల ధరలను రూ. 6,500 వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది మారుతి సుజుకీ.

ఆల్టో కే 10, ఎస్‌-ప్రెస్సో

సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎస్‌-ప్రెస్సో ఎల్‌ఎక్స్‌ఐ పెట్రోల్‌ వెర్షన్‌ రూ.2,000 తగ్గనుంది. అలాగే ఆల్టో కే10 వీఎక్స్‌ఐ పెట్రోల్‌ వెర్షన్‌ 6,500 రూపాయల వరకు తగ్గనుంది.

పెట్రోల్‌ వెర్షన్‌ 

తగ్గింపు తర్వాత ఆల్టో కే10 మాడల్‌ ధర రూ.3.99-5.96 లక్షలకు లభించనుండగా, ఎస్‌-ప్రెస్సో రూ.4.26 లక్షల నుంచి రూ.6.11 లక్షల (ఢిల్లీ-ఎక్స్‌ షోరూమ్‌)లోపు  లభించనుంది.

తగ్గింపు తర్వాత

గత నెలకుగాను 3,97,804 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు బజాజ్‌ ఆటో ప్రకటించింది. 

పెరిగిన బజాజ్‌ అమ్మకాలు

 ఏడాది క్రితం ఇదే నెలలో అమ్ముడైన 3,41,648 యూనిట్లతో పోలిస్తే 16 శాతం పెరిగాయని తెలిపింది. వీటిలో దేశీయంగా 2,53,827 యూనిట్లు, 1,43,977 యూనిట్లను ఎగుమతి చేసింది.

 ఏడాది క్రితం