09 July 2024
TV9 Telugu
జూలై నుంచి ఖర్చు పెరిగింది. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మొబైల్ రీఛార్జ్ ధరను ఒక్కసారిగా పెంచేశాయి. ప్రతి టెలికాం కంపెనీ దాదాపు 25 శాతం టారిఫ్లను పెంచింది.
మిగిలిన కంపెనీలు తమ రీఛార్జ్ రేట్లను పెంచగా, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దాని రీఛార్జ్ టారిఫ్లను పెంచలేదు. బదులుగా, బీఎస్ఎన్ఎల్ కొన్ని ప్లాన్లను అందిస్తోంది.
మరి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం ఎలాంటి ప్లాన్స్ ప్రవేశపెట్టిందో తెలుసుకుందాం.
బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్లలో ఒకటి రూ. 107 రీఛార్జ్ ప్లాన్. దీని వాలిడిటీ 35 రోజులు. ఇది 3జీబీ 4G డేటాను అందిస్తుంది. అదనంగా 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్ ఉంటాయి.
రూ.197 రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు 70 రోజులు. 2జీబీ 4జీ డేటా. మొదటి 18 రోజుల పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు. రూ.199 రీఛార్జ్ చేసుకుంటే 70 రోజుల పాటు అపరిమిత కాలింగ్.
ఈ ప్లాన్లో 150 రోజులు చెల్లుబాటు ఉంటుంది. ఇది మొదటి 30 రోజులకు 2జీబీ 4G డేటాను అందిస్తుంది. ఇతర నెట్వర్క్లకు పోటీగా బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్స్ను ప్రవేశపెడుతోంది.
797 రూపాయలతో ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 300 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ఇది మొదటి 60 రోజులకు 2GB 4G డేటాను అందిస్తుంది.
ఈ ప్లాన్లోఒక సంవత్సరం వ్యాలిడిటీ పొందవచ్చు. ఇది అపరిమిత కాలింగ్, 600జీబీ 4G డేటాను అందిస్తుంది. ఈ రీఛార్జ్ కాకుండా బీఎస్ఎన్ఎల్ ట్యూన్తో సహా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి.