19 May 2024
TV9 Telugu
రైలులో ప్రయాణించేటప్పుడు రూల్స్ తెలుసుకోవాలి. లేకుంటే మీకు జరిమానా కూడా పడవచ్చు. ఏఅవేంటో తెలుసుకుందాం.
రైలులో లోయర్ బెర్త్ సీటులో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూర్చోవడానికి మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదు. అలా చేస్తే ఇతరులు కూర్చోలేరు.
ముగ్గురు వ్యక్తులు దిగువ, మధ్య, ఎగువ బెర్త్లలో కూర్చొని ప్రయాణించవచ్చు. లోయర్ బెర్త్లో ఉన్న వ్యక్తి అంగీకరిస్తే, ఇద్దరు ప్రయాణికులు మిడిల్ బెర్త్లో పడుకోవచ్చు.
రాత్రిపూట టికెట్ చెకింగ్ కోసం చాలాసార్లు టీటీఈ వస్తుంటారు. రైల్వే రూల్స్ ప్రకారం.. రాత్రి 10 గంటల తర్వాత టీటీఈ నిద్రిస్తున్న ప్రయాణికుడిని నిద్ర లేపి టిక్కెట్ను చెక్ చేయకూడదు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నడిచే రైళ్లలో టీటీఈ టిక్కెట్లను తనిఖీ చేయలేరు. అతను ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు టిక్కెట్లను తనిఖీ చేయవచ్చు.
రాత్రి 10 గంటల తర్వాత తోటి ప్రయాణీకులెవరూ మొబైల్, గాడ్జెట్లో సంగీతాన్ని ప్లే చేయలేరు. మొబైల్లో పాటలు పాడాలన్నా తప్పనిసరిగా ఇయర్ఫోన్ వాడాలి.
ఎవరైనా ఈ నిబంధనను పాటించకుంటే రైల్వే ఉద్యోగికి ఫిర్యాదు చేయవచ్చు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది ఆ వ్యక్తికి అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత కూడా వినకుంటే అతనిపై చర్యలు.
రైలులో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు ఈ నిబంధనలన్నీ తెలుసుకోవాలి. ఒక వేళ నియమాలు ఉల్లంఘిస్తే రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటారు. జరిమానా ఉంటుంది.