హ్యుందాయ్ ఐపీఓ.. ఇక మదుపర్లకు పండగే పండగ..!

Phani CH

04 October 2024

మదుపర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా భారీ IPOకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. 

హ్యుందాయ్ ఐపీఓను అక్టోబర్ 14న మదుపర్ల ముందుకు తీసుకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఏకంగా రూ.25 వేల కోట్లను సమీకరించాలని హ్యుందాయ్ కంపెనీ భావిస్తోంది.

భారత స్టాక్ మార్కెట్ హిస్టరీలో అతిపెద్ద ఐపీఓగా హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ నిలవనుంది. 

ఇప్పటి వరకు 2022 సంవత్సరంలో వచ్చిన రూ.21 వేల కోట్ల ఎల్ఐసీ ఐపీఓ అతిపెద్దగా ఉంది. 

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ 1996 నుంచి భారత్‌లో బిజినెస్ నిర్వహిస్తోంది. 

హ్యుందాయ్ ఐపీఓపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో పెట్టుబడితో తమ సొమ్మును రెట్టింపు చేసుకోవాలని మదుపర్లు ఉవ్విళ్లూరుతున్నారు.