24 March 2024
TV9 Telugu
రేపు (మార్చి 25న) మద్యం షాపులు మూసి ఉండనున్నాయి. కారణం ఏంటంటే హోలీ పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో 24 సాయంత్రం 6 నుంచే బంద్ ఉన్నాయి.
ఈ హోలీ పండగ సందర్భంగా బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసి ఉంచాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, సైబరాబాద్తోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగకుండా వైన్స్ షాపులను మూసి ఉంచాలని పోలీసులు సూచించారు.
అయితే స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులను మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు.
ఈ మేరకు మద్యం షాపులపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల నుంచి ఆదేశాలు విడుదలయ్యాయి.
ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి.
హోలీ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్లపై ఇష్టారీతిన వేడుకలు జరుపుకుంటూ వచ్చీపోయే వారికి ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.