ఈ మధ్యంతర బడ్జెట్‌లో ఈ అంశాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి

23 January 2024

TV9 Telugu

ఫిబ్రవరి 1వ తేదీని మోడీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్‌. నిర్మలాసీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు

 చివరి బడ్జెట్‌

ఈ బడ్జెట్‌లో ఎన్నో వర్గాల వారు ఎదురు చూస్తున్నారు. మంత్రి నిర్మలమ్మ ఎలాంటి ప్రకటన చేస్తారోనని ఎదురు చూస్తున్నారు

ఎంతో మంది

దీని కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇది మధ్యంతర బడ్జెట్‌. ఇందులో పలు రంగాలకు కీలక ప్రకటనలు వచ్చే అవకాశం

మధ్యంత బడ్జెట్‌

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ రంగం అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది

ఎలక్ట్రిక్‌ రంగం

వ్యవసాయ రంగాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసే దిశగా ప్రభుత్వం భారీ ప్రకటన చేయవచ్చని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు

వ్యవసాయ రంగం

డ్రోన్‌ రంగం వృద్ధికి బుల్లెట్‌ స్పీడ్‌ ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించవచ్చని తెలుస్తోంది

డ్రోన్‌ రంగం

మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధిపై మోడీ ప్రభుత్వం కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది

మౌలిక సదుపాయాలు

ఈ బడ్జెట్‌లో గ్రీన్‌ ఎనర్జీ రంగానికి ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ ఇవ్వవచ్చు. పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించనుంది

పర్యావరణంపై