ఆన్‌లైన్‌ ఫుడ్‌ ప్రియులకు షాకిచ్చిన జోమాటో, స్విగ్గీ.. ఫీజు పెంపు

17 July 2024

TV9 Telugu

తాజాగా ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు భోజన ప్రియులకు షాకిచ్చాయి. ఇక ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు జొమాటో, స్విగ్గి మరోసారి ప్లాట్‌ఫారమ్ రుసుమును పెంచాయి.

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ 

ఒక ఆర్డర్‌కు రూ. 5 నుండి రూ.6కి పెంచాయి. ఇది 20 శాతం పెరుగుదల. ప్రస్తుతం ఈ రుసుమును ఢిల్లీ, బెంగళూరులో వసూలు చేస్తున్నారు. 

ఒక ఆర్డర్‌కు

ప్లాట్‌ఫారమ్ రుసుము డెలివరీ రుసుము, వస్తువులు, సేవల పన్ను (GST), రెస్టారెంట్ ఛార్జీలు, హ్యాండ్లింగ్ ఛార్జీలకు భిన్నంగా ఉంటుంది. 

ప్లాట్‌ఫారమ్ రుసుము

అధిక ప్లాట్‌ఫారమ్ రుసుము ఇతర నగరాలకు కూడా అందుబాటులోకి వస్తుంది. ప్లాట్‌ఫారమ్ రుసుము ఆహార అగ్రిగేటర్‌లకు ఖర్చులను నియంత్రించడానికి, ఆదాయాలను పెంచడానికి.

అధిక ప్లాట్‌ఫారమ్

ఏప్రిల్‌లో జోమాటో తన ప్లాట్‌ఫారమ్ రుసుమును 25 శాతం పెంచి ఒక్కో ఆర్డర్‌కు 5 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

ఏప్రిల్‌లో జోమాటో

జోమాటో గత సంవత్సరం ఆగస్టులో 2 రూపాయలు ప్లాట్‌ఫారమ్ రుసుమును పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆన్‌లైన్‌ ఫుడ్‌ కంపెనీలు.

జోమాటో 

తరువాత దాని మార్జిన్‌లను మెరుగుపరచడానికి, లాభదాయకంగా మారడానికి 3 రూపాయలకుకి పెంచాయి ఆన్‌లైన్‌ ఫుడ్‌ సంస్థ.

మార్జిన్‌లను మెరుగుపరచడానికి

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు ప్లాట్‌ఫారమ్ రుసుము విధించడం ద్వారా రోజుకు రూ. 1.25-1.5 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఫుడ్ డెలివరీ