చౌకగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..?

20 December 2023

TV9 Telugu

భారతదేశ వ్యాప్తంగా బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రజలకి కేంద్ర ప్రభుత్వం చక్కటి అవకాశం కల్పించింది.

రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (RBI) కొత్త సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24ను తాజాగా ప్రారంభించింది.

ఈ డిసెంబర్ 22 వరకు ఈ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చని తెలిపింది రిజర్వ్ బ్యాంక్.

రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (RBI) సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ III ధరను గ్రాముకు రూ.6199గా నిర్ణయించింది.

NSE, BSE, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్టాఫీసులు లేదా వాణిజ్య బ్యాంకుల వంటి స్టాక్ ఎక్స్ఛేంజీల నుండి SBGని కొనుగోలు చేయవచ్చు.

సావరిన్ గోల్డ్ బాండ్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే గ్రాముకు రూ. 50 అదనపు తగ్గింపు లభిస్తుందని తెలిపింది.

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా ఒక వ్యక్తి 1 గ్రాము నుండి 4 కిలోల బంగారం వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ట్రస్ట్, సంస్థలు ఒక సంవత్సరంలో 20 కిలోల వరకు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం కల్పించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్.