బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాపై ఆర్బీఐ  రూ.5 కోట్ల జరిమానా.. కారణం ఏంటంటే

24 December 2023

ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda)కు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) భారీ షాక్‌ ఇచ్చింది. 

ఆర్బీఐ

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(BOB)కు మరోసారి భారీ మొత్తంలో జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

చిరిగిన నోట్ల మార్పిడికి సంబంధించిన లావాదేవీల్లో వ్యత్యాసం కన్పించడంతో ఈ బ్యాంక్‌కు ఆర్బీఐ రూ.5 కోట్ల పెనాల్టీ వేసింది.

5 కోట్ల జరిమానా 

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జరిమానా విధించిన విషయాన్ని శుక్రవారం నాటి ఎక్చేంజ్ ఫైలింగ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

అంతేకాకుండా చిరిగిన నోట్లలో నకిలీ నోట్లను గుర్తించిన రిజర్వ్‌ బ్యాంక్‌.. బీవోబీకి అదనంగా మరో రూ.2,750 వడ్డించింది.

చిరిగిన నోట్లలో నకిలీ నోట్లు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) డిసెంబర్‌ 18, 20 తేదీల్లో వేర్వేరుగా ఈ జరిమానా విధించినట్లు  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెల్లడించింది.

వేర్వేరు జరిమానాలు

కాగా, గత నెలలో కూడా ఈ బ్యాంకుకు ఆర్బీఐ పెద్ద మొత్తంలో ఫైన్‌ వేసింది. రూల్స్‌ ఉల్లంఘించి పెద్ద మొత్తంలో రుణాలు జారీ చేసినందుకు రూ.4.35 కోట్ల భారీ జరిమానా విధించింది.

రూల్స్‌ ఉల్లంఘన

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఆయా బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇలా జరిమానాలు విధిస్తూ షాకిస్తోంది.

నిబంధనలు