బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

 జీరో సినిమా తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అతను మళ్లీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బిజీ అయిపోయాడు.

తాజాగా ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాను సందర్శించాడు షారుఖ్ ఖాన్.

అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశాడు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'అల్లాహ్‌ షారుఖ్‌ను దీవించాలి' అని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రం జనవరి 25న విడుదల కానుంది.

ఈ సినిమా హిట్‌ కావడం షారుఖ్‌కు ఎంతో ముఖ్యం. అందుకే సినిమా విడుదలకు ముందే మక్కా యాత్రకు వెళ్లాడు.