బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్లో సందడి చేస్తున్నారు.
ఆయన నటిస్తోన్న కభీ ఈద్ కభీ దివాళీ సినిమా గత కొద్ది రోజులుగా భాగ్యనగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ క్రమంలో బుధవారం సినీ కార్మికుల సమ్మె కారణంగా ఆయన సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది.
దీంతో విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్లతో కలిసి ఓ ప్రైవేట్ పార్టీలో సందడి చేశారు సల్మాన్..
తాజాగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గోన్నారు..