బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికలలో కరీనా కపూర్ ఒకరు.

అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న కరీనాకు.. ఇటు దక్షిణాదిలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్న తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న కరీనా.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది.

అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కరీనా కపూర్ నటించనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న స్పిరిట్ (Spirit) చిత్రంలో కరీనా నటించనున్నట్లు టాక్ వినిపించింది.

ఈ వార్తలపై స్పందించిన కరీనా తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని.. తాను స్పిరిట్ సినిమాలో నటించనున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. 

ప్రస్తుతం కరీనా సుజోయ్ ఘోష్ చిత్రంలో నటిస్తుంది.