నితిన్‌, రష్మిక మందన్నహీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం తాజాగా పట్టాలెక్కింది

‘భీష్మ’ లాంటి విజయం తర్వాత ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు

శుక్రవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది

ఈ చిత్రం ముహూర్తపు షాట్ కి చిరంజీవి క్లాప్‌ కొట్టగా.. బాబీ కెమెరా ఆన్ చేశారు

అలాగే గోపీచంద్‌ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు

అలాగే గోపీచంద్‌ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు

హను రాఘవపూడి, బుచ్చిబాబు కలిసి స్క్రిప్ట్‌ అందించడం జరిగింది

ఇది వినోదాత్మకంగా సాగే అడ్వెంచరస్‌ చిత్రమని తెలిపింది చిత్రబృందం