అల్లు అర్జున్ నటించిన ‘వరుడు’ తో తెలుగు తెరకు పరిచయమయ్యారు భానుశ్రీ.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకు అనుకున్నంత సక్సెస్ రాలేదు.
2021 వరకూ పలు తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు విజయం దక్కలేదు. ప్రస్తుతం యూట్యూబ్ వేదికగా నెటిజన్లను ఆమె అలరిస్తున్నారు.
వయసు.. సినిమా పరిశ్రమలో ఉన్న నిజమైన సమస్య. ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీలను కేవలం తల్లి పాత్రలకే పరిమితం చేస్తారు.
పురుషులకు వచ్చేసరికి అది వర్తించదు. వాళ్లు ఎప్పటిలాగానే ప్రధాన పాత్రల్లో నటిస్తుంటారు.
ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆమె తాజాగా ట్వీట్ చేశారు.
దీనిని చూసిన నెటిజన్లు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని కొంతమంది అంగీకరిస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఇదేమీ పెద్ద సమస్య కాదని అంటున్నారు.