పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

 నిన్న మొన్నటి వరకు నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న ఈ భామకు..ప్రభాస్‌తో నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది.

‘బీస్ట్’,..‘ఆచార్య’ వరుసగా హాట్రిక్ ఫ్లాప్స్ అందుకుంది. తాజాగా రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘సర్కస్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయింది.

పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది.

 అంతేకాదు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌లతో బిజీగా ఉంది.

ఈ ఇయర్ ఈమె నటించిన సినిమాలు అంతగా సక్సెస్ కాకపోయినా.. ఈమె హవా మాత్రం తగ్గడం లేదు.

దువ్వాడ జగన్నాథం మూవీ నుంచి వరుస సక్సెస్‌లతో ఉన్న ఈ భామ జైత్రయాత్రకు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాధే శ్యామ్’ బ్రేకులు వేసింది.

 తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు,త్రివిక్రమ్ సినిమాలో ఈమె నటిస్తోంది. అటు మహేష్ బాబుతో వరుసగా రెండో సినిమా చేస్తోంది.