IPL 2022: రెండు గ్రూపులు, 10 జట్లు.. మార్చి 26న తొలి మ్యాచ్

ఐపీఎల్-2022(IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. మే 29వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

అయితే మ్యాచ్‌ల తేదీలు, ఎప్పుడు ఎక్కడ జరుగుతాయనే వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.

ఈసారి పది జట్లు 70 లీగ్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి.

పది జట్లను రెండు వర్చువల్‌ గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి జట్టూ 14 లీగ్‌ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.

ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్‌లను వాంఖడే, డీవై పాటిల్‌ మైదానాల్లోనూ.. మూడేసి మ్యాచ్‌లను సీసీఐ (ముంబయి), ఎంసీఏ అంతర్జాతీయ స్టేడియాల్లో (పుణె) ఆడాలి.

వాంఖడే స్టేడియంలో 20 మ్యాచ్‌లు, సీసీఐ మైదానంలో 15, డీవై పాటిల్‌ స్టేడియంలో 20, పుణె ఎంసీఏ మైదానంలో 15 మ్యాచ్‌లు జరుగుతాయి.

గ్రూప్‌-ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్

గ్రూప్‌బి: చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి.