టాలీవుడ్‌లో ప్రభాస్‌-అనుష్కల జోడీకి సెపరేట్‌ ఫ్యాన్‌బేస్‌ ఉంది.

త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే రూమర్స్‌ కూడా వినిపిస్తున్నాయి.

కానీ అందరూ అనుకున్నట్టు తమ మధ్య ఏమీ లేదని, కేవలం ఫ్రెండ్స్‌  ఫ్యాన్స్‌ కు క్లారిటీ ఇచ్చేసారు.

ఇక తాజాగా మరోసారి ప్రభాస్‌-అనుష్కల రిలేషన్‌షిప్‌పై సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్‌ రీసెంట్‌గా విడుదలైన సంగతి తెలిసిందే.

దీన్ని ప్రభాస్‌ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. టీజర్‌ చాలా బావుందంటూ ప్రశంసలు కురిపించాడు.

దీనిపై అనుష్క స్పందిస్తూ.. థ్యాంక్యూ 'పప్సు' అంటూ కామెంట్‌ చేసింది.

ఈ స్టోరీని స్క్రీన్‌ షాట్‌ చేసిన పలువురు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.