‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క, ‘జాతిరత్నాలు’ తర్వాత నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే
మహేష్బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ - ప్రమోద్ నిర్మిస్తున్నారు
ఈ మూవీ ఈ వేసవిలో తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది
తాజాగా ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ ఖరారు అయింది
ఈ టైటిల్ ని బుధవారం అధికారికంగా ప్రకటిస్తూ ఓ లుక్ని విడుదల చేసింది చిత్రబృందం
హీరోయిన్ అనుష్క అన్విత రవళిశెట్టి అనే షెఫ్ పాత్రలోనూ, హీరో నవీన్ సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్ పాత్రలోనూ ఈ చిత్రంలో కనిపించనున్నారు
అనుష్క, నవీన్ కొంచెం విరామం తీసుకుని చేసిన చిత్రమిది. ఆసక్తికరమైన ఈ కలయికపై భారీ అంచనాలున్నాయి
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందుతోందని మూవీ మేకర్స్ తెలిపారు