హీరో రవితేజ కుటుంబం నుంచి మరో హీరో తెలుగు తెరకు పరిచయం కానున్నారు

రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్‌ను హీరోగా పరిచయం చేయనున్నారు దర్శకురాలు గౌరీ రోణంకి

ఈ చిత్రానికి జేజేఆర్‌ రవిచంద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు

గురువారం హైదరాబాద్‌లో  పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది

ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు  కె.రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టి ప్రారంభించారు

ఈ చిత్ర దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్‌ అందించగా డి.సురేష్‌బాబు కెమెరా ఆన్ చేశారు

బెక్కెం వేణుగోపాల్‌, చదలవాడ శ్రీనివాసరావు, రఘు తదితరులు ఈ కార్యక్రమనికి హాజరయ్యారు

ఈ నేపథ్యంలో దర్శకురాలు గౌరీ మాట్లాడుతూ..  ‘‘ఇది నా రెండో చిత్రం. చాలా యూత్‌ ఫుల్‌గా ఉంటుంది’’ అని తెలిపారు