24 September 2023

వరల్డ్ ఫాస్ట్ ట్రైన్.. గంటలో హైదరాబాద్ నుంచి విశాఖకు..!

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు పొరుగు దేశం చైనాలో పరుగులు పెడుతోంది. 

బుల్లెట్ రైళ్ల విషయంలో డ్రాగన్ కంట్రీ చైనా చాలా ముందుంది.చైనాలోని ఫాస్టెస్ట్ రైలుకు మాగ్లెవ్‌గా నామకరణం చేశారు. 

చైనాలోని మాగ్లెవ్‌ రైళ్లు గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. 

జర్మనీకి చెందిన మాగ్లెవ్ టెక్నాలజీతో సూపర్ ఫాస్ట్ ట్రైన్‌ను రూపొందించింది చైనా. 

సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ షాంఘై మాగ్లెవ్. షాంఘై నగరాల మధ్య నడుస్తోంది.

ఇనుప చక్రాలు కాకుండా మాగ్నెటిక్ లెవిటేషన్‌తో బుల్లెట్ రైలు నడుస్తుంది. 

మాగ్నెటిక్ టెక్నిక్‌లో అయస్కాంత ప్రభావం కారణంగా, రైలు స్థిరంగా శబ్దం లేకుండా అధిక వేగంతో పరుగుపెడుతుంది. 

ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య బుల్లెట్ రైలు ఫ్రాన్స్‌కు చెందింది. 

Euroduplex TGV అనే ఫ్రాన్స్ రైలు.. గంటకు 574.8 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టి రికార్డు సృష్టించింది.