యాంకర్‌, నటి అనసూయ ఏం చేసినా, ఏ పోస్ట్‌ పెట్టిన అది చర్చనీయాంశమవుతుంది.

ఇక సోషల్‌ మీడియాలో ఆమెకు సోషల్‌ మీడియాలో ఉండే ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

 ఆమెకు ప్రశంసించే వారు ఎంతమంది ఉన్నారో విమర్శించే వారు సైతం అదే స్థాయిలో ఉన్నారు. అందుకే అనసూయ పెట్టే ప్రతి పోస్ట్‌ వార్తల్లో నిలుస్తుంది. 

‘పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న మీకు ఇదంతా అవసరమా ఆంటీ?’ అంటూ అనసూయ పోస్ట్స్‌పై నెటిజన్లు ట్రోల్స్‌కు దిగుతారు. 

దీంతో వారి కామెంట్స్‌కి ఆమె స్పందిస్తూ గట్టి కౌంటరిస్తుంది. ఆయనప్పటికీ ట్రోలర్స్‌ మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో అనసూయ షేర్‌ చేసిన తాజా పోస్ట్‌ చూసి ట్రోలర్స్‌ కంగుతిన్నారు. తనని ట్రోల్స్‌ చేస్తున్న వారికి దిమ్మతిరిగేలా అనసూయ షాకింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది.

 మహిళలను కించపరిచేలా సోషల్‌ మీడియా అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హైదరాబాదఁఖ పోలీసులు సామాజీక మాధ్యమాలపై ఆంక్షలు విధించారు.

దీనికి సంబంధించిన న్యూస్‌ను అనసూయ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది.