‘లైగర్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్‌ హీరోయిన్ అనన్య పాండే.

ప్రస్తుతం విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంకా పేరు ఖరారు కానీ ఈ మూవీ సైబర్‌ థ్రిల్లర్‌ చిత్రంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఈ చిత్రం ఇటీవలే  షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గున్న ఈ చిత్ర దర్శకుడు టైటిల్ ను అని  ప్రకటించారు.

కంప్యూటర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కంట్రోల్‌’ అనే పేరును పెడుతున్నట్లు తెలిపారు.

ఈ చిత్రాన్ని నిఖిల్‌ ద్వివేది ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ‘ఖో గయే హమ్‌ కహాన్‌’ చిత్రంలో ఆమె నటిస్తుంది.

అంతేకాక ఆయుష్మాన్‌ ఖురానాకి జోడిగా ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది.