మల్లేశం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అనన్య నాగళ్ల.

తర్వాత సైన్స్ ఫిక్షన్ మూవీ ప్లే బ్యాక్ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.

ప్రస్తుతం శ్రీకాకుళం యాసలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతుతోంది ఈ బ్యూటీ.

రాజా రామ్మోహన్‌ చల్లా దర్శకత్వంలో అనన్య నాగళ్ల, రవి మహాదాస్యం జంటగా  ఓ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ చిత్రాన్ని వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు.

వెన్నెల కిషోర్‌, సియా గౌతమ్‌, నాగ మహేష్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ మేరకు దర్శకుడు రాజా రామ్మోహన్‌ మాట్లాడుతూ.. ‘‘విభిన్నమైన కథతో.. శ్రీకాకుళం యాస ఇతివృత్తంగా సాగే చిత్రమిది.

కామెడీ, ఎమోషన్‌, సెంటిమెంట్‌లతో కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని తెలిపారు.