ఓ పక్క తన లైనప్‌ ఫిల్మ్‌తో తెగ బిజీగా ఉన్న అల్లు అర్జున్.. మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

అందుకోసం ఇప్పటికే ఏసియన్ థియేటర్స్‌తో కలిసి అమీర్ పేట్ సత్యం థియేటర్ ప్లేస్‌లో AAA సినిమాస్ పేరుతో ఓ కొత్త మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసందే.

అయితే ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కోసం ముహూర్తం ఫిక్స్ అయింది.

జూన్ 15న ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది.

ప్రభాస్‌ మోస్ట్ అవేటెడ్‌ మూవీ ఆదిపురుష్‌ని ఇందులో మొదటిగా స్క్రీనింగ్ చేయనున్నారు.

భక్తి పారవశ్యంలో మునిగితేలుతూన తనో థియేటర్ వాడయ్యారనే సంతోషంలో ఎగిరి గంతేయనున్నారు ఐకాన్ స్టార్.

ఇక దాదాపు రెండేళ్ల నుంచి కన్స్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఈ మల్టీ ప్లెక్స్‌ తాజాగా పూర్తైంది.

దీంతో జూన్‌ 15నే తన బ్రాండ్ పేరుతో ఉన్న ఈసినిమాస్‌ను ఓపెన్‌ చేయనున్నారు అల్లు అర్జున్.

అంతేకాదు.. జూన్‌ 16న రిలీజ్‌ అయ్యే ఆదిపురుష్‌ సినిమాను ఈ థియేటర్లోనే ప్రీమియర్ వేసేందుకు ప్లాన్ కూడా చేస్తున్నారు బన్నీ అండ్ టీం.

త్రీడీలోనూ.. 2డీలోనూ.. ప్రభాస్‌ సినిమాను స్క్రీనింగ్ చేసి.. తన థియేటర్ కలెక్షన్స్‌కు మాంచి బూస్టప్‌ ఇవ్వాలని అనుకుంటున్నారట.