ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు.

‘పుష్ప 2’ రిలీజ్ కావడానికి ముందే తన కొత్త సినిమాను ప్రకటించాడు.

బన్నీ బాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది.

హిందీలో బడా ప్రొడక్షన్ హౌస్ అయిన టీ సిరీస్.. బన్నీ-సందీప్ రెడ్డి ప్రాజెక్టుని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

ఇప్పటివరకు ‘అర్జున్ రెడ్డి’ దాని హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తానేంటో ప్రూవ్ చేసుకున్న సందీప్

ప్రస్తుతం ‘యానిమల్’ తీస్తున్నాడు. దీని తర్వాత ప్రభాస్ తో ‘స్పిరిట్’ చేయాల్సి ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ ని లైన్ లో పెట్టాడు.

మరి ప్రభాస్-బన్నీ సినిమాల్లో ఎవరిది ముందు స్టార్ట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.