ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు దుబాయ్‌ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది.

ప్రసిద్ది చెందిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) గోల్డెన్‌ వీసా తాజాగా బన్నీ అందుకున్నారు.

కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసాను అందుకున్న టాలీవుడ్‌ తొలి హీరోగా అల్లు అర్జున్‌ నిలవడం విశేషం.

దుబాయ్‌ దేశం ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘నాకు ఎన్నో అనుభూతులు పంచిన దుబాయ్‌కి థాంక్స్‌. త్వరలోనే మళ్లీ కలుద్దామ’ అంటూ పోస్ట్‌ చేశాడు.

అంతేకాదు మెగా కోడలు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కూడా ఈ వీసా అందుకున్నారు.

కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్‌, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు దుబాయ్‌ ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది.

దీని ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుడా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు వీలు కలుగుతుంది.

2019 నుంచి ఈ గోల్డెన్‌ వీసాలు మంజూరు చేస్తుందీ యూఏఈ ప్రభుత్వం.