సురేందర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్‌ హీరో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఏజెంట్‌’.

ఈ చిత్రంలో అఖిల్‌కి జోడిగా సాక్షి వైద్య నటించింది.

ఈ చిత్రంలో  మలయాళీ నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు.

భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 28న విడుదలైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

కాగా ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఓటీటీ విడుదలకు సిద్ధంగా ఉంది.

‘సోనీలివ్‌’  వేదికగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

తాజాగా ‘ఏజెంట్‌’ చిత్రం ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది ‘సోనీలివ్‌’ .

ఈ నెల 19 నుంచి ఈ చిత్రం ఓటీటీలో ప్రసారం కానున్నట్లు ప్రకటించింది.