ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ బయోపిక్ గా వస్తున్న చిత్రం ‘మైదాన్‌’.

ఈ చిత్రంలో సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ పాత్రలో అజయ్‌ దేవ్‌గణ్‌ నటించిన సంగతి తెలిసిందే.

అజయ్‌ దేవ్‌గణ్‌కి జోడిగా సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుంది.

ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం వాయిదాలు పడుతూ వస్తుంది.

అయితే ఈ నెల 23న విడుదల కావాల్సి ఉండగా  మరోసారి వాయిదా పడింది.

మరో కొత్త డేట్‌ని చిత్రబృందం త్వరలోనే ప్రకటించనుందని సమాచారం.

ఇప్పటికే ఈ చిత్రం ఏడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం విడుదల పదేపదే వాయిదా పడుతుండడంతో థియేటర్‌ల్లోనే వస్తుందా? చివరికి ఓటీటీ బాట పడుతుందా? అనే సందేహాలు వస్తున్నాయి.

అయితే ఈ చిత్రం విడుదల విషయంలో ఏమి జరగనుందో చూడాలి.

కాగా ఈ చిత్రం వాయిదాతో ఆ స్థానంలో విక్రమ్‌ భట్‌ నిర్మిస్తోన్న ‘1920: హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.