అఖిల్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఏజెంట్‌’.

ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

అక్కినేని అభిమానులను నిరాశ పరిచినందుకు వివరణ కూడా ఇచ్చింది చిత్ర బృందం.

మరో రెండు వారాల్లో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్.

అయితే, ఓటీటీ విడుదలను చివరి నిమిషంలో  వాయిదా వేసి త్వరలోనే తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

థియేటర్‌లో ప్రేక్షకులను నిరాశ పరచడం వల్ల ఓటీటీ వెర్షన్‌లో మార్పులు చేసినట్లు సమాచారం.

అనవసర సీన్స్‌ను తీసేసి నిడివి కారణంగా తొలగించిన మంచి సీన్స్‌ను జోడించి సరికొత్త వెర్షన్‌తో  ఓటీటీలో విడుదల చేయనున్నారు.

సోనీలివ్‌ ద్వారా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జూన్‌ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీనిపై ఇంకా ఓటీటీ వేదిక సోనీలివ్‌ నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు.

కాగా ఈ చిత్రంలో అఖిల్‌కి జోడిగా సాక్షి వైద్య నటించింది.