‘అతడు’(2005),  ‘ఖలేజా’ (2010) సినిమాలు మహేశ్, త్రివిక్రమ్‌ కలయికలో వచ్చాయి

ఇప్పుడు మూడోసారి పన్నెండేళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్‌ కలయికలో 'SSMB28' వర్కింగ్ టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతుంది

‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చాయి

ఇప్పుడు మరోసారి పన్నెండేళ్ల తర్వాత 2021లో ‘పుష్ప: ది రైజ్‌’తో వీరిద్దరూ విజయాన్ని అందుకున్నారు

ప్రస్తుతం వీరిద్దరి కలయికలో  ‘పుష్ప: ది రైజ్‌’కు కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్‌’ చిత్రీకరణ జరుగుతుంది

ఆది పినిశెట్టి, అరివళగన్‌ కాంబినేషన్‌లో  2009లో వచ్చిన హారర్‌ ఫిల్మ్‌ ‘ఈరమ్‌’ మంచి హిట్‌ సాధించింది

2011లో తెలుగులో  ‘వైశాలి’గా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది

ఇప్పుడు పద్నాలుగేళ్ల తర్వాత రెండోసారి ఆది, అరివళగన్‌ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ‘శబ్ధం’ అనే సినిమా తెరకెక్కుతుంది