ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా ఈనెల 16వ తేదీ ఐదు భాషలలో ప్రపంచ వ్యాప్తంగా  విడుదలవుతున్న విషయం మనకు తెలిసిందే.

రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో ఎంతో ఘనంగా నిర్వహించారు.

వేడుకకు లక్షలాది మంది అభిమానులు తరలించారు. ఎంతోమంది అభిమానుల సమక్షంలో ఈ సినిమా వేడుక ఎంతో ఘనంగా జరిగింది.

ఇక ఈ సినిమా వేడుకలో దాదాపు 1000 మంది పోలీసులు పెద్ద ఎత్తున సెక్యూరిటీ నిర్వహించారని తెలుస్తుంది.

పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంత చేసుకోవడంతో ఆయనకు మరింత సెక్యూరిటీ కల్పించడం కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేశారని తెలుస్తుంది.

ఈ కార్యక్రమానికి 1000 మంది పోలీసులు సెక్యూరిటీ నిర్వహించడమే కాకుండా ప్రత్యేకంగా ప్రభాస్ కోసం దాదాపు 100 మంది ప్రవేట్ సెక్యూరిటీని నియమించారని తెలుస్తోంది.

ఇలా వీరందరి కోసం నిర్మాతలు అదనంగా 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారని సమాచారం.

ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం చేతనే ఆయన కోసం ఇలా ప్రవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక కోసం మేకర్స్ సుమారు మూడు కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది.