ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఇతిహాస చిత్రం ‘ఆదిపురుష్’కు ఓ అరుదైన గౌరవం దక్కించుకుంది.
చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ట్రిబెకా ఫెస్టివల్’లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చేస్తూ దర్శకుడు ఓంరౌత్ హర్షం వ్యక్తం చేశారు.
‘‘ఇది గౌరవం, సంతోషానికి మించింది. 2023 జూన్ 13న ‘ఆదిపురుష్’ న్యూయార్క్లో జరిగే ట్రిబెకా ఫెస్టివల్లో ప్రదర్శితమవుతుంది.
ఈ సినిమాని ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. నా చిత్ర బృందానికి నేను కృతజ్ఞుణ్ని.
ఆ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని తెలిపారు ఓం రౌత్.
కాగా ఆ వేడుక జూన్ 7 నుంచి 18 వరకు జరగనుంది.
అన్ని కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.