నాలుగు పదుల వయసులోనూ ఇప్పటి యువకథానాయికలకు పోటీనిస్తుంది హీరోయిన్ త్రిష. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు.

చాలా కాలం సినిమాకు దూరంగా ఉంది. ఇటీవలే 96 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఇందులో త్రిష యువరాణి కుందవై పాత్రలో కనిపించి మెప్పించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష మాట్లాడుతూ..కరోనా కారణంగా నా ఖాళీ సమయాన్ని ఇలా గడిపాను అన్నది..

నా ఖాళీ సమయాన్ని రచయిత కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్ పుస్తకం మొత్తం చదివాను. ఆ పుస్తకం పూర్తిగా భాగాలు ఉన్నాయి.

నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే.. 5 భాగాలున్నా పుస్తకాన్ని కేవలం రెండు భాగాల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇది నాకు ఊహకు అందని విషయం అంటూ చెప్పుకొచ్చింది త్రిష.