టాలీవుడ్ అగ్రకథానాయికలలో సమంత ఒకరు. ప్రస్తుతం సామ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం, యశోద చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి.

త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోవైపు  ఖుషి చిత్రీకరణలో పాల్గొంటుంది సామ్.

ఇక తెలుగులోనే కాకుండా హిందీలోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

దీంతో ఆమె భారీగా రెమ్యునరేషన్ పెంచినట్లుగా ఇండస్ట్రీలోకి టాక్ వినిపిస్తుంది.

ఇప్పటివరకు తెలుగులో సామ్ ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లు తీసుకుందని..

ఇక ఇప్పుడు బాలీవుడ్ చిత్రాలకు దాదాపు రూ. 5-8 కోట్లు తీసుకుంటున్నట్లుగా టాక్ నడుస్తుంది.

అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సామ్..ఇప్పుడిప్పుడె తిరిగి యాక్టివ్ అవుతుంది.