మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నివేదా పేతురాజ్.
ఆతర్వాత సాయిధరమ్ తేజ్తో కలిసి చిత్రలహరి సినిమాలో కనిపించింది.
ఇటీవల బ్లడ్ మేరీ సినిమాతో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టిందీ ముద్దుగుమ్మ.
చేసింది తక్కువ సినిమాలే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుందీ సొగసరి.
అయితే సూపర్ హిట్మాత్రం ఈ అందాల భామకు దక్కలేదు.
ఈక్రమంలో స్టార్ హీరోయిన్ అన్న ట్యాగ్పై స్పందించిన నివేద పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నాకు హీరోయిన్ కన్నా నటిగా అనిపించుకోవడమంటేనే గర్వంగా ఉంటుంది.నటనకు ప్రాధాన్యముంటే ఎలాంటి పాత్రలైనా చేస్తాను అని చెప్పుకొచ్చింది