30 July 2024

బ్లాక్ శారీలో మెంటలెక్కిస్తోన్న మౌనీ రాయ్.. సెగలు పుట్టిస్తోందిగా..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్లకు ధీటుగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది టీవీ నటి మౌనీ రాయ్. ఈ బ్యూటీకి ఓ రేంజ్ ఫాలోవర్స్ ఉన్నారు. 

మౌనీ రాయ్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటాయి. అలాగే మిలియన్ వ్యూస్, లక్షల్లో లైక్స్ సంపాదించుకుంటూ నిత్యం నెట్టింట సందడి చేస్తుంది. 

తాజాగా బ్లాక్ శారీలో మతిపోగొట్టే అందాలతో నెట్టింట రచ్చ చేసింది. నడుమందాలతో వయ్యారాలు పోతూ సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది ఈ బ్యూటీ.

ఈ బ్యూటీ తరచూ మోడ్రన్, గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ హంగామా చేస్తుంటుంది. అలాగే జిమ్ వర్కవుట్స్, డైట్,  ఫిట్నెస్ అంటూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. 

ఎప్పుడూ గ్లామర్ ఫోటోలతో హీటెక్కించే మౌనీ రాయ్.. ఇప్పుడు మాత్రం ట్రెడిషనల్ లుక్ లో ఫిదా చేసింది. బ్లాక్ చీర కట్టి వయ్యారాలు పోయింది నాగిని హీరోయిన్. 

బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన మౌనీ రాయ్.. నాగిని సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. ఈ సీరియల్ తో ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది. 

అలాగే ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటుంది. ఇటీవల రణబీర్, అలియా కలిసి నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేసింది మౌనీ రాయ్. 

అంతేకాకుండా ప్రశాంత్ నీల్, యష్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ మూవీలో ఓ స్పెషల్ చేసింది. 2022లో తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.