సినీ పరిశ్రమలో విలన్ పాత్రలతో మెప్పించి ఆ తర్వాత హీరోలుగా మారిన స్టార్స్ ఎందరో ఉన్నారు..

పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో అదరగొట్టి.. ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు గోపిచంద్..

జయం సినిమాలో విలన్‏గా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిజం, వర్షం మూవీస్ లోనూ విలనిజాన్ని చూపించారు.. 

యజ్ఞం సినిమాతో మరోసారి హీరోగా స్క్రీన్ పై అలరించాడు.

 విలన్ పాత్రలు అనేది అప్పుడున్న పరిస్థితుల కారణంగా మాత్రమే చేయాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం పక్కా కమర్షియల్.