తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం సినిమాతో తెలుగు తెరకు కమిడియన్ గా పరిచయం అయినా సుమన్ శెట్టి.

మొదటి సినిమాతోనే తనదైన కామెడీ టైమింగ్ తో నంది అవార్డు గెలుచుకున్నారు.

ఆ తరువాత పలు సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ ఎదిగారు.తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళం భాషల్లో చేసారు.

అయితే ఈ మధ్య సినిమాలకు గ్యాప్ వచ్చింది.కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ తెలుగు ప్రజలకి కనిపించడం లేదు.

సినీ దూరం వల్ల సోషల్ మీడియాలో పలు రూమర్స్ క్రెయేట్ అయ్యాయి.

ఈ రూమర్స్ మీద చాలాసార్లు సుమన్ శెట్టి స్పందించినప్పటికీ రూమర్స్ తగ్గలేదు..

తన ఆరోగ్యం పాడైయింది అని సోషల్ మీడియాలో వార్తలపై తాజాగా మరోసారి స్పందించారు.

ఇంతమంది ఉన్న ఇండస్ట్రీ లో నన్ను ఒకడిని గుర్తు పెట్టుకొని మరి నా గురించి రాస్తున్నారు థాంక్స్ రా సామి అన్నారు.