అయోధ్యపై మళ్లీ కదిలిన ఆర్‌ఎస్‌ఎస్

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మోహన్ భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాముడి పని కార్యరూపం దాల్చేలా మనం పని చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఇది మన పని.. మనకోసం చేయాల్సిన పని అంటూ పిలుపునిచ్చారు. మరోవైపు అయోధ్యలో రామాలయం నిర్మాణంపై విశ్వ హిందూ పరిషత్ కూడా స్పందించింది. మోహన్ భగవత్ […]

అయోధ్యపై మళ్లీ కదిలిన ఆర్‌ఎస్‌ఎస్
Follow us

| Edited By:

Updated on: May 28, 2019 | 12:25 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మోహన్ భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాముడి పని కార్యరూపం దాల్చేలా మనం పని చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఇది మన పని.. మనకోసం చేయాల్సిన పని అంటూ పిలుపునిచ్చారు.

మరోవైపు అయోధ్యలో రామాలయం నిర్మాణంపై విశ్వ హిందూ పరిషత్ కూడా స్పందించింది. మోహన్ భగవత్ వ్యాఖ్యలను వీహెచ్పీ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ సమర్థించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని రాజకీయ కోణంలో చూడలేమని అలోక్ కుమార్ అన్నారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ అధికారంలో రావడంతో ఆలయ నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు.