మాకు పని, పాలన మీదే ఆసక్తి,, ‘సెల్ఫ్ డబ్బా’ పై కాదు, నితీష్ కుమార్

బీహార్ లో నేరాలు తగ్గిపోయాయని, ప్రస్తుతం ప్రభుత్వ డేటా ప్రకారం రాష్ట్రం ఈ విషయంలో 23 వ ర్యాంకింగ్ లో ఉందని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. పని, పాలన.. వీటిమీదే తాము దృష్టి కేంద్రీకరించామని, అంతేగానీ విపక్షాల మాదిరి ‘సెల్ఫ్-ప్రమోషన్’ పై కాదని ఆయన చెప్పారు. సాక్రా విధాన్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాలవన్నీ ఊకదంపుడు హామీలన్నారు. మా ప్రభుత్వ విధానాలే మమ్మల్ని ఈ ఎన్నికల్లో గెలిపిస్తాయి అని […]

మాకు పని, పాలన మీదే ఆసక్తి,,  'సెల్ఫ్ డబ్బా' పై కాదు, నితీష్ కుమార్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 26, 2020 | 5:06 PM

బీహార్ లో నేరాలు తగ్గిపోయాయని, ప్రస్తుతం ప్రభుత్వ డేటా ప్రకారం రాష్ట్రం ఈ విషయంలో 23 వ ర్యాంకింగ్ లో ఉందని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. పని, పాలన.. వీటిమీదే తాము దృష్టి కేంద్రీకరించామని, అంతేగానీ విపక్షాల మాదిరి ‘సెల్ఫ్-ప్రమోషన్’ పై కాదని ఆయన చెప్పారు. సాక్రా విధాన్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాలవన్నీ ఊకదంపుడు హామీలన్నారు. మా ప్రభుత్వ విధానాలే మమ్మల్ని ఈ ఎన్నికల్లో గెలిపిస్తాయి అని నితీష్ కుమార్ పేర్కొన్నారు. కాగా-ప్రధాని మోదీ ఈ  నెల 28 న మూడు ఎన్నికల ప్రచార సభల్లో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొననున్నారు. వచ్ఛేనెల 1న  మోదీ చాప్రా, తూర్పు చంపారన్, సమస్తిపూర్ ప్రచార సభల్లో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.