నెల రోజుల తరువాత పాజిటివ్ కేసు.. గ్రీన్ నుంచి ఆరంజ్ జోన్కు మార్పు..!
కరోనాను అరికట్టే క్రమంలో ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది కేరళ. మొదట ఆ రాష్ట్రంలో ఎక్కువ కేసులే నమోదైనప్పటికీ.. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
కరోనాను అరికట్టే క్రమంలో ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది కేరళ. మొదట ఆ రాష్ట్రంలో ఎక్కువ కేసులే నమోదైనప్పటికీ.. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కాగా తాజాగా కేరళలోని వయనాడ్ ప్రాంతం ఆరంజ్ జోన్లో చేరింది. ఆ ప్రాంతంలో శనివారం ఒక కేసు నమోదు కాగా.. వయనాడ్ జిల్లాను గ్రీన్ నుంచి ఆరంజ్ జోన్కు మారుస్తున్నట్లు రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలిపారు.
ఇదిలా ఉంటే శనివారం కేరళలో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో వయనాడ్ ఒకటి కాగా కన్నూర్లో మరొకటి నమోదైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 499కు చేరింది. ఇక కేరళలలో మొత్తం 80 హాట్స్పాట్లు ఉన్నాయి. ఇక అలప్పుళ, త్రిస్సూర్ ప్రాంతాల్లో గత 21 రోజులుగా ఎలాంటి పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో.. ఆ ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా మార్చారు. కాగా కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ.. మద్యం షాపులు, మాల్స్, బ్యూటీ పార్లర్లు, బార్బర్ షాపులు రాష్ట్రవ్యాప్తంగా మూసివేసి ఉంటాయని విజయన్ స్పష్టం చేశారు.
Read This Story Also: ఎక్కడివారు అక్కడే ఉండండి.. జగన్ విఙ్ఞప్తి