రైతు బిల్లుల ఆమోదం, సరికొత్త మలుపునకు శీకారం, మోదీ
రైతు బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. దేశంలో వ్యవసాయ రంగ చరిత్రను కొత్త మలుపు తిప్పిన 'ఉద్యమం'తో దీన్ని పోల్చారు. ఇది భారత వ్యవసాయ రంగంలో ఓ 'వాటర్ షెడ్ మూవ్ మెంట్'..
రైతు బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. దేశంలో వ్యవసాయ రంగ చరిత్రను కొత్త మలుపు తిప్పిన ‘ఉద్యమం’తో దీన్ని పోల్చారు. ఇది భారత వ్యవసాయ రంగంలో ఓ ‘వాటర్ షెడ్ మూవ్ మెంట్’ అన్నారు. దేశంలోని రైతులను అభినందిస్తున్నానని, దశాబ్దాల తరబడి వివిధ ఆంక్షలు, మధ్య దళారుల వేధింపుల కారణంగా నష్టపోయిన అన్నదాతలకు ఈ బిల్లుల ఆమోదం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఆ కష్టాల నుంచి పార్లమెంట్ వారిని దూరం చేసిందన్నారు. ఈ బిల్లుల వల్ల వారి ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు.
కాగా.. రాజ్యసభలో ఈ బిల్లులపై విపక్షాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ఏకంగా డిప్యూటీ చైర్మన్ స్థానం వద్దకే వెళ్లి బిల్లు తాలూకు రూల్ బుక్ ని చింపి వేశారు.
A watershed moment in the history of Indian agriculture! Congratulations to our hardworking farmers on the passage of key bills in Parliament, which will ensure a complete transformation of the agriculture sector as well as empower crores of farmers.
— Narendra Modi (@narendramodi) September 20, 2020