ఫోన్ అప్డేట్ చేయకపోతే తప్పదు భారీ నష్టం.. నిపుణుల హెచ్చరిక
మీ ఫోన్ని హ్యాకర్ల నుంచి కాపాడుకోవాలంటే.. అప్డేట్ చేయాల్సిందేనని అంటున్నారు నిపుణులు. ఆండ్రాయిడ్ ఫోన్ అప్డేట్ చేయకపోతే మీ రహస్య సమాచారమంతా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని నివారించేందుకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ...
మీ ఫోన్ని హ్యాకర్ల నుంచి కాపాడుకోవాలంటే.. అప్డేట్ చేయాల్సిందేనని అంటున్నారు నిపుణులు. ఆండ్రాయిడ్ ఫోన్ అప్డేట్ చేయకపోతే మీ రహస్య సమాచారమంతా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని నివారించేందుకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ ఇండియా) దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది.
తమ ఫోన్లలో ఇంకా పాత ఓఎస్ వాడుతున్న వారు ప్రమాదం అంచున ఉన్నట్టు సెర్ట్ తెలిపింది. ఇలాంటి వాళ్ల మొబైల్ ఫోన్లను సైబర్ నేరగాళ్లు చాలా ఈజీగా హ్యాక్ చేస్తారని వెల్లడించింది. గూగుల్ ఆండ్రాయిడ్లో స్టాండ్హాగ్ 2.0 అనే బగ్ ఉన్నట్టు కొనుగొన్నామని.. దీని బారిన పడిన ఫోన్లలోని ఏ యాప్ అయినా హ్యాకర్లు హైజాక్ చేయవచ్చంటూ సెర్ట్ పేర్కొంది.
ఆండ్రాయిడ్ ఓఎస్ను ఉపయోగించే వారందరూ తమ మొబైల్లో అప్డేట్లను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఎలా చేయాలంటే.. ఫోన్లో ఉండే సెట్టింగ్స్లోకి వెళ్లి.. సిస్టమ్ అప్డేట్ అనే ఆప్షన్ను తెరవాలి. దానిలో అప్డేట్పై ఏదైనా సూచన కనిపిస్తే.. వెంటనే తమ ఫోన్ను అప్డేట్ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అన్ని మొబైల్స్.. ఆండ్రాయిడ్ 10ని సపోర్ట్ చేస్తాయని చెప్పారు. అలాగే ఈ-మెయిల్, మెసేజ్ల ద్వారా వచ్చే లింక్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సెర్ట్ హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
ప్రముఖ రచయిత జొన్న విత్తులపై ఎస్సీ, ఎస్టీ కేసు..
బ్రేకింగ్: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా