కృష్ణా జిల్లా : పెళ్లి విందులో పీపీఈ కిట్లతో కేటరింగ్ బాయ్స్…
కరోనా వైరస్...మనుషులు మొత్తాన్ని ఇంట్లో కూర్చోబెట్టింది. ఈ మహమ్మారి దెబ్బుకు ప్రజల జీవిన విధానాలు, అలవాట్లు పూర్తిగా మారిపోయాయి.
Catering Boys in PPE Kits : కరోనా వైరస్…మనుషులు మొత్తాన్ని ఇంట్లో కూర్చోబెట్టింది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజల జీవిన విధానాలు, అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. మానవ జీవితాల్లో శుభ్రత ఇప్పడు ప్రధాన పాత్ర పోషిస్తోంది. మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి అయ్యాయి. ఈ క్రమంలో కరోనా సమయంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ముదినేపల్లి గ్రామంలో జరిగిన ఓ పెళ్లి అందర్నీ ఆకర్షించింది. ఈ పెళ్లి కోవిడ్ నిబంధనల ప్రకారం తక్కువమంది అతిథులతోనే జరిగింది. కాకపోతే.. పెళ్లి విందు మాత్రం సమ్థింగ్ డిఫరెంట్. పెళ్లికి వచ్చిన అతిథులకు భోజనం వడ్డించే క్యాటరింగ్ బాయ్స్ అందరూ పీపీఈ కిట్లు ధరించారు. దీంతో పెళ్లికి వచ్చిన వారంతా వీరిని చూసి ఆశ్చర్యపోయారు.
తొలుత కరోనా రోగి ఎవరైనా ఉన్నారేమో..అతని కోసం వచ్చారనుకున్నారు. తర్వాత విషయం తెలుసుకొని ఈ మాత్రం జాగ్రత్తలు పాటించాలని చర్చించుకున్నారు. ఇక భోజనాల సిట్టింగ్స్ వద్ద కూడా భౌతిక దూరం పాటించారు. కరోనా కట్టడికి ఇటువంటి జాగ్రత్తలు తప్పవని, పెళ్లివారు కోరడంతోనే పీపీఈ కిట్లు ఏర్పాటు చేసినట్టు కేటరింగ్ సిబ్బంది తెలిపారు.
ఇది కూడా చదవండి: కుమార్తెలతో కాడి మోయిస్తూ రైతు వ్యవసాయం..చలించిపోయిన సోనూసూద్..