ఏసీబీ చెరలో వీటీడీఏ ప్లానింగ్ ఆఫీసర్
భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ వేములవాడ ఆలయ అభివృద్ధి ముఖ్య ప్రణాళికాధికారి లక్ష్మణ్గౌడ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. వేములవాడకు చెందిన సంపత్ రుద్రారంలో ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన లే అవుట్ అనుమతి కోసం లక్ష్మణ్ గౌడ్ను ఆశ్రయించాడు. అనుమతి మంజూరు చేయాలంటే 8 లక్షల రూపాయలను లక్ష్మణ్గౌడ్ డిమాండ్ చేయగా, రూ.6.5 లక్షలు ఇచ్చేందుకు సంపత్ అంగీకరించి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. హైదరాబాద్ కోఠిలోని తన నివాసానికి వచ్చి […]
భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ వేములవాడ ఆలయ అభివృద్ధి ముఖ్య ప్రణాళికాధికారి లక్ష్మణ్గౌడ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. వేములవాడకు చెందిన సంపత్ రుద్రారంలో ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన లే అవుట్ అనుమతి కోసం లక్ష్మణ్ గౌడ్ను ఆశ్రయించాడు. అనుమతి మంజూరు చేయాలంటే 8 లక్షల రూపాయలను లక్ష్మణ్గౌడ్ డిమాండ్ చేయగా, రూ.6.5 లక్షలు ఇచ్చేందుకు సంపత్ అంగీకరించి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
హైదరాబాద్ కోఠిలోని తన నివాసానికి వచ్చి డబ్బు అందజేయాలని లక్ష్మణ్ గౌడ్ సంపత్కు తెలిపారు. దీంతో సంపత్ కోఠి వెళ్లి లక్ష్మణ్ గౌడ్ కుమారుడు రోహిత్కు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. లక్ష్మణ్గౌడ్తో పాటు ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకుని, నగదును సీజ్ చేశారు.