8 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ వీఆర్ఏ
ప్రభుత్వం ఎట్టి కఠిన చట్టాలు తీసుకువచ్చిన కాలరాస్తూ.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా కడప జిల్లాలోని మైలవరంలో మరో దారుణం చోటుచేసుకుంది. మైలవరంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న నాగమునయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
కామాంధుల కబంధ హస్తాలకు పసిమొగ్గలు వాలుతున్నాయి. అభయం శుభం తెలియని చిన్నారులను కీచకులు చిదిమేస్తున్నారు. ప్రభుత్వం ఎట్టి కఠిన చట్టాలు తీసుకువచ్చిన కాలరాస్తూ.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగాకడప జిల్లాలోని మైలవరంలో మరో దారుణం చోటుచేసుకుంది. మైలవరంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న నాగమునయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికపై వీఆర్ఏ నాగమునయ్య అత్యాచారం చేశారు. చిన్నారికి మాయమాటలు చెప్పి స్థానిక రామాలయం ఆవరణలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. జరిగిన విషయాన్ని స్థానికులకు బాలిక తెలియడంతో నిందితుడిని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మైలవరం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా, మునెయ్యను కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.